రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా బుక్కైన అధికారి
కమిటెడ్ వాల్యూయేషన్ సర్టిఫికెట్ కోసం రూ.8 వేలు డిమాండ్
నిర్మల్ అర్బన్, ఆగస్టు 5:ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు నిర్మల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్. ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ పొందేందుకు కమిటెడ్ వాల్యూయేషన్ సర్టిఫికెట్ అవసరం కాగా, దానిని తీసుకునేందుకు విశ్రాంత ఉద్యోగి రాజేశ్వర్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడి ఉద్యోగి రూ.10వేలు డిమాండ్ చేసి, రూ.8వేలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, గురువారం డబ్బులు తీసుకుంటున్న శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు.
అవినీతి అధికారులు పన్నిన వలకు సీనియర్ అసిస్టెంట్ చిక్కాడు. ఓ రిటైర్డ్ అధికారి తన పెన్షన్ డబ్బుల కోసం డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో కమిటెడ్ వ్యాల్యువేషన్ సర్టిఫికెట్ కోసం వెళ్లగా.. సీనియర్ అసిస్టెంట్ ఓరుగంటి శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో రూ.10 వేలు గురువారం శ్రీనివాస్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య వెల్లడించారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన ఓరుగంటి రాజేశ్వర్ 2018లో ఎఫ్ఎస్వోగా రిటైర్డ్ అయ్యారు. అతనికి సంబంధించిన బెనిఫిట్స్ కోసం ఖానాపూర్ ఎఫ్డీవో కమిటెడ్ వ్యాల్యువేషన్ సర్టిఫికెట్ కోసం జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్కు పంపారు.
ఇక్కడి అధికారులు రాజేశ్వర్ను పరీక్షించిన తర్వాతే వారు అందించే సర్టిఫికెట్ ఆధారంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానున్నాయి. ఇందుకోసం గత నెల 14న మెడికల్ ఎగ్జామ్కు హాజరయ్యారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ కోసం సీనియర్ అసిస్టెంట్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా.. చివరికి రూ.8 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. విసిగిపోయిన రాజేశ్వర్ గత నెల 26న ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ప్రకారం భద్రయ్య డిప్యూటీ డీఎంహెచ్వోలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్కు రూ.10 వేలు ఇవ్వగా.. అందులోంచి రూ.2 వేలను రాజేశ్వర్కు తిరిగి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కెమికల్ టెస్టులు నిర్వహించగా.. లంచం తీసుకున్నట్లు రుజువైంది. దీంతో శ్రీనివాస్పై కేసు నమోదు చేసి కరీంనగర్లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు జాన్రెడ్డి, ఎస్పీ రవీందర్, సంజీవ్, రాము, తదితరులు పాల్గొన్నారు.