ఎదులాపురం, అక్టోబర్ 19 : బాబాల అవతా రంలోని మోసగాళ్లను జిల్లా పోలీసులు సకాలం లో వలపన్ని పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామానికి చెందిన గోటు ముక్లే సుగ్రీవ్ (30), ఆదిలాబాద్లోని గాంధీన గర్ కాలనీకి చెందిన బాల్శంకర్ సంగీత(40) కలిసి కూరగాయల వ్యాపారం చేసుకునే వారు. వీరిద్దరూ తక్కువ కాలంలో ఎక్కవ మొత్తం డబ్బు సంపాదించేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో జూన్ 15న న్యూహౌసింగ్బోర్డు కాలనీలో ఉండే మహ్మద్ ఫారూఖ్ ఇంట్లోకి వెళ్లి వీరు మంత్రతం త్రాలతో హోమం చేసి నగదును రెట్టింపు చేస్తామ న్నారు. వారిచ్చిన రూ.50 వేలను హోమంలో ఉంచినట్లు చేసి వాటిని రూ.80 వేలుగా చూయిం చారు. తర్వాత మహ్మద్ ఫారూఖ్ సోదరికి చెంది న రూ.లక్షను రూ.లక్షన్నరగా చేసినట్లు నమ్మించా రు. వీరిని పూర్తిగా నమ్మేసిన ఫారూఖ్ కుటుంబం రూ.29 లక్షలు వారికి ఇచ్చి దాన్ని రెట్టింపు చేయా లని కోరారు. ఈ క్రమంలో మోసగాళ్లు హోమం చేస్తున్నట్లు నటించారు. రెండు రోజులు ఆగి చూడాలని అప్పుడు రూ.29 లక్షలు, రూ.58 లక్ష లవుతాయని నమ్మించారు. అక్కడి నుంచి ఉడా యించారు.
రెండు రోజుల తర్వాత ఈ కుటుంబం అక్కడ చూసే సరికి రెట్టింపు డబ్బు సంగతి అటుంచి తామిచ్చిన రూ.29 లక్షలు కనిపించ లేదు. దీంతో మోసపోయినట్లుగా తెలు సుకుని బాధితులు మావల పోలీస్స్టేషన్లోఈ నెల 13న ఫిర్యాదు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు పగడ్బం దీగా నిఘా ఉంచారు. ఈ మోసగాళ్లను 19న మంగళవారం ఉదయం గాంధీనగర్ లోని సంగీత ఇంట్లో వలపన్ని పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.11 లక్షల 70 వేల నగ దు, రూ.20 వేల విలువైన 2 సెల్ఫోన్లు, రూ.60 వేల విలువైన ల్యాప్టాప్, రూ.20 వేల విలువైన రెండు బంగారు పూత ఉన్న గాజులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ముత్తూట్ ఫైనాన్స్లో మూడు తులాల బంగారు గాజులు కుదువపెట్టిన ట్లు నిందితులు విచారణలో చెప్పారు. రిమాండ్ తర్వాత మరింత విచారణకు పోలీస్ కస్టడీకి ఇవ్వా లని న్యాయస్థానానికి విన్నవిస్తామని ఇన్చార్జి ఎస్పీ తెలిపారు. వారంరోజుల్లోనే కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు, టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రమౌళి, మావల ఎస్ఐ హరిబా బు, టాస్క్ఫోర్స్ ఏఎస్ఐ సయ్యద్ తాజొద్దీన్, మావల ఏఎస్ఐ గండ్రత్ గంగాధర్, టాస్క్ఫోర్స్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.