నిర్మల్ అర్బన్, ఆగస్టు 2 : నిర్మల్ పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పట్టణం లోని దివ్యనగర్, మంజులాపూర్ కాలనీల్లో ఆయ న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంత్రి అల్లో ల ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలి పారు. కోట్లాది రూపాయల నిధులతో పట్టణాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. రూ.40 కోట్ల నిధులతో నిర్మించిన ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా ప్రజలకు తాగునీటిని అం దించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. చైర్మన్ కు కాలనీ వాసులు పలు సమస్యలను విన్నవించా రు. వీటిని మంత్రి సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏఈ వినయ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద ర్, స్థానిక కౌన్సిలర్ కొండ సబిత శ్రీధర్, పూదరి రాజేశ్వర్, కాలనీ అధ్యక్షుడు సుదర్శన్, కాలనీ వాసులు అంబాజీ, భీంరావ్, శంకర్, సంతోష్, మహేందర్, తదితరులున్నారు.