నిర్మల్ టౌన్, మార్చి 16 : నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంటల సాగు విధానంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో మొదటి విడుత కింద మంజూరైన ‘మన ఊరు మన బడి’ పనులను వేగంగా పూర్తి చేసి నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లాలో 229 పాఠశాలల్లో పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, పనులు పూర్తి చేసిన వాటికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్సీడ్ తోటలను సాగు చేసేలా ఉద్యానవనశాఖ అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో రవీందర్రెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శ్యాంరావ్ రాథోడ్, పంచాయతీరాజ్శాఖ ఈఈ శంకరయ్య, డీఈ తుకారాం, ఆర్అండ్బీ ఈఈ అశోక్, ఆర్డీవో స్రవంతి, డీఆర్వో లోకేశ్వర్, ఏవో అంజిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను కలెక్టర్ వరుణ్రెడ్డి, డీఈవో రవీందర్రెడ్డి
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ రాష్ట్ర అర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్కుమార్, నిర్మల్ కన్వీనర్ సాయిచరణ్, నాయకులు అజయ్ రాథోడ్, పృథ్విక్, జాదవ్, మిథున్, ప్రవీణ్, సచిన్, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, మార్చి 16 : ప్రజల ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని మన్మథ్ గ్రామంతో పాటు లోకేశ్వరంలో కలెక్టర్ పర్యటించారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, చెత్త సేకరణ, సెగ్రిగేషన్, దోమల నివారణ చర్యలు, డ్రైడే-ఫ్రైడే, బృహత్ పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, పౌష్టికాహార లోపంపై తీసుకుంటున్న చర్యలు, కంటి వెలుగు, మన ఊరు మన బడి తదితర విషయాలపై పంచాయతీ కార్యదర్శులు అనుసరిస్తున్న పనితీరును అడిగి తెలుసుకున్నా రు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామ సభల ద్వారా గ్రామాభివృద్ధి, సైబర్ నేరా లు, బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహ న కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్ కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో సాల్మన్ రాజ్, ఏపీవో జగన్నాథ్, ఏపీఎం మల్లేశ్, పశువైద్యాధికారి జెస్సీ, అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీలక్ష్మి, ఆయా
గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎఫ్ఏలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.