నేరడిగొండ, జూలై 31 : ప్రకృతి వనాలతో పల్లెల కు కొత్త శోభ వస్తున్నదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని ఆరెపల్లి, నేరడిగొండ గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఆరెపల్లి గ్రామంలోని ఎవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. అనంతరం నేరడిగొండలోని పల్లె ప్రకృ తి వనాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రకృతి వనాలతో పల్లెలన్నీ కనువిందు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆరెపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్ వివరాల ను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పార్కులో పెంచుతున్న మొక్కల వివరాలు, మొ క్కలు పెంచే విధానంపై డీఎఫ్వో రాజశేఖర్ వివరించారు. జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రా థోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, డీఆర్డీ వో కిషన్, ఎఫ్డీవో బర్నోబా, తహసీల్దార్ శ్రీదే వి, ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో లక్ష్మణ్, ఏపీవో వసంత్రావ్, డిప్యూటీ రేంజ్ అధికారి రవికుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సంరక్షణపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
హరితహారంలో నాటిన మొ క్కలను పెంచడంలో నిర్లక్ష్యం చేస్తే, బాధ్యులపై చర్యలుంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. మండలంలోని కోకస్మన్నూర్ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా కలెక్టర్, అధికారులు శనివారం మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు నీరు పోశారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, ఓపెన్ బా వులను పరిశీలించారు. జీపీకి ఎదురుగా పాత బా విని ఎందుకు పూడ్చడం లేదంటూ కార్యదర్శి రమేశ్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కా లనీలో తాగునీటి సమస్యపై మహిళలు కలెక్టర్కు మొర పెట్టుకోగా, వెంటనే పరిష్క రించాలని కార్యదర్శిని ఆదేశించారు. సర్పంచ్ గంగారాం, జడ్పీటీసీ సుభద్ర, ఎంపీపీ నిమ్మల ప్రీత మ్ రెడ్డి, ఎంపీటీసీ సుజాత, డీఆర్డీవో కిషన్, డీ ఎఫ్వో రాజశేఖర్, తహసీల్థార్ అతిఖొద్దీన్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, ఎఫ్డీవో బర్నోబా, ఎఫ్ఆ ర్వో పాండురంగ్, ఏపీవో నరేందర్ గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవార్డు..
పచ్చదనం, పారిశుధ్య నిర్వహణలో రాణించినందున ప్రభుత్వ డిగ్రీ క ళాశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు ప్రదానం చేసి నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ క్ అన్నారు. మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి ఒక జిల్లా -ఒక హరిత విజేతలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈ అవార్డును శనివారం తన ఛాంబర్లో ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్కు అందజే సి, అభినందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డీ దయాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.