దండేపల్లి, సెప్టెంబర్ 28 : ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేలా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్, కేవీకే శాస్త్రవేత్త రాజేశ్వర్నాయక్ సూచించారు. మండలంలోని తానిమడుగు గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం-వ్యవసాయ శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే రకాలపైన దృష్టి సారించాలన్నారు. పంట మార్పిడి, అంతర పం టల సాగు, భూసార పరిరక్షణ, జల సంరక్షణ, వర్షపు నీటిని ఒడిసి పట్ట డం, వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్లు, చేపల పెంపకం, యాంత్రీకరణపై దృష్టి సారిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. అనంతరం యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్ర సంగాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రసారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, కేవీకే శాస్త్రవేత్తలు శివకృష్ణ, నాగరాజు, తిరుపతి, స్రవంతి, మండల వ్యవసాయాధికారి అంజిత్కుమార్, ఏటీఎం సంధ్య, సర్పంచ్ ప్రేమల,ఆర్బీఎస్ కోఆర్డినేటర్ కిశోర్, రైతులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై..
మండలంలోని దుగ్నెపల్లి గ్రామంలో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ విస్తారణ అధికారి దివ్య మంగళవారం అవగాహన కల్పించారు. వరికి బదులు పప్పు దినుసులు, నువ్వులు, చిరు ధాన్యాలు జొన్న, సజ్జలు. కొర్రలు, కూరగాయాల పంటలు సాగు చేయాలని సూచించారు. సాగులో ఎలాంటి సందేహాలు ఉన్న వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మోతె తిరుపతి, రైతులు పాల్గొన్నారు.