హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. సెలవులను పొడగించిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. మళ్లి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మళ్లీ ప్రకటిస్తామన్నారు.
కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అన్నిరకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. అయితే కేసుల ప్రభావం తగ్గకపోవడంతో ఈ నెల 30 వరకు సెలవులను పొడగించింది. దీంతో విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వర్సిటీలు వాయిదా వేస్తున్నాయి.
ఇప్పటికే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు పోస్టుపోన్ చేస్తున్నట్లు పరీక్ష నియంత్రణ అధికారి ఏవీఎన్ రెడ్డి తెలిపారు.