హైదరాబాద్ : తెలంగాణలోని నేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8 శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు పథకం భరోసాను ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.