shilpa reddy | ‘భరోసా’ కేంద్రాలతో మహిళలకు అపారమైన భరోసా అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లోని ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి ఆ వ్యవస్థ పనితీరును ప్రశంసించారు. ఉద్వేగపూరిత హృదయంతో ‘తెలంగాణ గడ్డ.. ఆడబిడ్డల భరోసాకు అడ్డా!’ అంటూ ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
‘తెలంగాణలో ఆడబిడ్డల సంరక్షణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విషయంలో తెలుగు బిడ్డగా గర్విస్తున్నాను. షీ టీమ్స్ ఆధ్వర్యంలోని భరోసా కేంద్రాన్ని సందర్శించాక నా అపోహలన్నీ తొలగిపోయాయి. రాష్ట్రంలో మహిళలు, పిల్లలను రక్షించడానికి పోలీసులు చేస్తున్న కృషిని నేను దగ్గరుండి చూశాను. దేశంలో ఈ తరహా రక్షణ వ్యవస్థ కలిగిన ఏకైక రాష్ట్రం మనదే. భరోసా కేంద్రాలను సందర్శించే మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతూ, ఎంతో సున్నితమైన కేసుల్ని కూడా సులువుగా పరిష్కరిస్తున్నారు. గృహహింస, వేధింపులు, నేరాల నుంచి రక్షణ కల్పిస్తూ.. వైద్య, న్యాయ సహాయం అందిస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారా మనోబలాన్ని ఇస్తున్నారు. మహిళలకు ధైర్యాన్నిస్తున్న భరోసా కేంద్రాలకు, షీ టీమ్స్ సభ్యులకు హ్యాట్సాఫ్. ఇక్కడ కొన్ని హృదయ విదారక కథలనూ విన్నాను. వాటిని చాలా సున్నితంగా పరిష్కరిస్తున్న పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే. భరోసా కేంద్రాల గురించి ప్రచారం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా’ అంటూ కొనియాడారు శిల్పారెడ్డి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
విడాకుల తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న సమంత.. కల నెరవేరిందంటూ వేదాంతం
Samantha | చార్ధామ్ యాత్రలో శిల్పారెడ్డితో సమంత
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
ఇక జరిగింది చాలు.. వైరల్గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ పోస్టు