Samantha char dham yatra | నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో రెగ్యులర్గా వినిపిస్తుంది. అసలు చైతూతో ఆమె ఎందుకు విడిపోయింది? ఇందులో సమంత తప్పే ఉందా? విడాకులకు ఇవే కారణాలు అయి ఉంటాయి అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో సమంతపై వస్తున్న ట్రోల్స్ చూసి ఆమె సన్నిహితులు ఎంతగానో బాధపడ్డారు. అక్కినేని ఫ్యామిలీ కోసం, నాగ చైతన్య కోసం సమంత ఎన్నో వదులకుందని.. వాటి గురించి తెలవకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని విన్నవించుకున్నారు. అయినా సరే తనపై ట్రోల్స్ ఆగకుపోవడంతో చివరకు కోర్టును కూడా ఆశ్రయించింది సమంత. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత తన రూట్ మొత్తం మార్చేసింది. తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి సమంత చార్ధామ్ యాత్ర కు వెళ్లింది. అక్కడ ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో మునిగితేలుతుంది సామ్. వీటికి సంబంధించి సమంత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత.. ఆధ్యాత్మిక యాత్ర వివరాలను అభిమానులతో పంచుకుంది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాలు చూడాలని ఎంతగానో పరితపించి పోయా. ఎప్పటికైనా వీటిని చూడాలని కలలు గన్నా. గొప్ప అద్భుతాలకు నెలవు, దైవాలు కొలువైనా ఈ భూతల స్వర్గాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అంటూ రాసుకొచ్చింది. తన ఆధ్యాత్మిక యాత్ర ఎంతో ఉత్కంఠగా సాగిందని తెలిపింది.ఈ ట్రిప్ ఇంత స్పెషల్గా సాగడానికి ముఖ్య కారణం తన స్నేహితురాలు, సోదరి శిల్పారెడ్డినే కారణమని పేర్కొంది. కాగా, చార్ధామ్ టూర్.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ సామ్తో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకుంది శిల్పా రెడ్డి. ఏదైమైనా సమంత చార్ధామ్ యాత్ర పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha is back | సమంత ఈజ్ బ్యాక్..జిమ్లో కసరత్తులు
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..