టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా ఉన్న నాగ చైతన్య-సమంత అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. ఆమెదే తప్పు అన్నట్టుగా పలువురు విమర్శలు చేశారు.వాటిపై సమంత కూడా ధీటుగానే స్పందిస్తుంది. ఇటీవల అమ్మ చెప్పింది అంటూ పలు సూక్తులు పోస్ట్ చేస్తూ, తప్పు తనది కాదని ఇన్డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది.
అయితే వెంకటేష్ కూడా ఇటీవలి కాలంలో నిత్యం రిలేషన్, నమ్మకం, ప్రేమ వంటి విషయాలపై తన ఇన్స్టాగ్రామ్లో పలుపోస్ట్లు పెడుతున్నారు. తాజాగావెంకటేష్ షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిన్ను ఇష్టపడిన వాళ్లను దుర్వినియోగం చేయకు. నువ్వే కావాలి అనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను మోసం చేయాలని చూడకు. ఎప్పుడు గుర్తుపెట్టుకునే వాళ్లను అస్సలు మరచిపోకు అంటూ వెంకీ తన పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఇది సమంతని ఉద్దేశించే పెట్టాడని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3 చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఆయన నటించిన దృశ్యం 2 విడుదల కావలసి ఉంది.