హయత్నగర్ : మిర్యాలగూడలో జరిగిన వివాహానికి ఆర్టీసీ హయత్నగర్ డిపో-1కు చెందిన బస్సును బుక్ చేసు కున్నందుకు హస్తినాపురానికి చెందిన నూతన వధువరులు జీవన్రెడ్డి, గ్రీష్మ జంటకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బహుమతిని అందజేశారు.
బస్సు డైవర్ శివకుమార్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేసినట్లు డిపో మేనేజర్ టి.రఘు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రఘు మాట్లాడుతూ ప్రయాణీకులు సురక్షిత ప్రయాణాల కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
అతి తక్కువ ధరలో ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తమ సంస్థ ఏర్పాట్లు కల్పించిందని వెల్లడించారు. పెండ్లిళ్లు , శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.