కావలసిన పదార్థాలు
బియ్యం: మూడు కప్పులు, పెసర పప్పు: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర, ఆవాలు: ఒక టీస్పూన్, మిరియాలు: పది, జీడిపప్పు: పది, కరివేపాకు: ఒక రెబ్బ, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో నానిన బియ్యం, అప్పుడే కడిగిన పెసరపప్పు, తగినంత ఉప్పు, ఎనిమిది కప్పుల నీళ్లుపోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. చివరగా పసుపు జోడించి పోపును పప్పు మిశ్రమంలో కలుపుకొంటే పులగం సిద్ధం.