మాంసాహారం, పాలు ఒకేసారి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం మాంసాహారం-పాలను ‘విరుద్ధ ఆహారం’గా పిలుస్తారట. అందుకే, ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణాలు చెబుతూ.. మాంసం వేడిచేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పాలు చలువ చేస్తాయి. కాబట్టి, ఈ రెండూ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. పాలు, మాంసంలో ప్రొటీన్స్, పోషకాలు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి.
కాబట్టి, ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, వికారం లాంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. కొందరిలో గుండెల్లో మంట కూడా వస్తుందట. కాబట్టి, మాంసాహారం తిన్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల విరామం ఇచ్చిన తర్వాతే పాలు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక చేపలు తిన్న తర్వాత పాలు తాగితే.. తీవ్రమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.