Vakkalanka Laxmi | హైదరాబాద్లో పుట్టి పెరిగి దుబాయ్లో ఆర్ట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ.. ఆ దేశ స్వర్ణోత్సవాల్లో ప్రత్యేక గౌరవాన్ని పొందారు వక్కలంక లక్ష్మి. ప్రతిష్ఠాత్మక వేడుకల్లో తన పెయింటింగ్స్ను ప్రదర్శించే అవకాశం ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే..
నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్స్లో డిగ్రీ చేశాను. మా వారు వక్కలంక శ్రీనివాస్ అడ్వర్టయిజింగ్ రంగంలో నిపుణులు. ఆయన సహకారంతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచీ పెయింటింగ్స్ వేయడం ఇష్టం నాకు. తీరిక దొరికితే చాలు.. క్యాన్వాస్పై ప్రయోగాలు చేస్తుంటాను. అడ్వర్టయిజింగ్లో మరిన్ని మెలకువలు నేర్చుకొని.. ఆర్ట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాను. పెండ్లి తర్వాత దాదాపు 25 ఏండ్లుగా దుబాయ్లోనే ఉంటున్నాం. ఈ దేశంలో అడుగుపెట్టిన నాటినుంచి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను క్షుణ్నంగా పరిశీలించేదాన్ని. ప్రకృతి సౌందర్యానికి .. కుంచెతో ఓ రూపం ఇచ్చేదాన్ని. అది చూసే ‘వరల్డ్ ఆర్ట్ దుబాయ్- 2022’ నిర్వాహకులు నాకు ఆ దేశ స్వర్ణోత్సవాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న ఈ వేడుకల్లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్ ఓ భాగం. ఇక్కడ దాదాపు 500 మంది చిత్రకారుల పెయింటింగ్స్ ప్రదర్శిస్తున్నారు. ‘గల్ఫ్ గౌర్మెట్’, ‘విజిట్ ఆన్ ఐన్’ అనే మాస పత్రికలకు నా డిజైనింగ్తో చక్కని రూపం ఇచ్చాను. ప్రముఖ కార్పొరేట్ సంస్థలకూ క్రియేటివ్ యాడ్స్ రూపొందించాను. తెలుగు రాష్ర్టాలలో మరింతమంది ఆర్టిస్టులను తయారు చేసే ఉద్దేశంతో హైదరాబాద్లో త్వరలోనే ‘ఆర్ట్ స్టూడియో’ ప్రారంభించనున్నాం.
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”