న్యూఢిల్లీ, ఆగస్టు 14 : విద్యార్థులే భారత దేశ భవిష్యత్ను నిర్మించే శిల్పులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పేపర్ల లీక్లు, అక్రమాలను నిరోధించి.. వ్యవస్థను పారదర్శకంగా, పూర్తి సురక్షితంగా, విశ్వాసంతో ఉండేలా పబ్లిక్ పరీక్షల విధానాన్ని సంస్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఆమె పేర్కొన్నారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థుల వర్తమాన, భవిష్యత్ను కాపాడటానికి కృషి చేయాలన్నారు.‘పరీక్షా విధానాన్ని సమగ్రంగా సంస్కరించడానికి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటున్నది. పబ్లిక్ పరీక్షలలో అక్రమాలను పూర్తిగా నిరోధించడమే వీటి లక్ష్యం’ అని రాష్ట్రపతి వెల్లడించారు.