తెలకపల్లి, ఏప్రిల్ 7 : అభివృద్ధిలో తె లంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పల్లెల్లో వెలుగులు నింపిన ఘన త టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ‘మన పల్లెకు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా తెలకపల్లి మండలం పెద్దపల్లి, గడ్డంపల్లి గ్రా మాల్లో బుధవారం జెడ్పీ చైర్పర్సన్, ఎ మ్మెల్యే పర్యటించారు. రైతువేదిక భవనా లు, సీసీరోడ్డు, పల్లె ప్రకృతి వనాలను ప్రా రంభించారు.
అనంతరం గ్రామాల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటితో గ్రామాలకు వలసలు వాపస్ వస్తున్నాయన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అనే నానుడిని నిజం చేసిన ఘ నత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఎం జీకేఎల్ఐ ద్వారా రెండు పంటలు పండి స్తూ రైతులు తృప్తిగా జీవిస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతు బతుకుకు భరోసా ఏర్పడిందన్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్యా ర్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లు, రైతువేదిక వంటి పనులు చేపట్టామన్నారు.
అవ్వ బాగున్నావా.. : ఎమ్మెల్యే
గ్రామాల్లో కలియదిరుగుతూ వృద్ధుల ను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించా రు. అవ్వ బాగున్నావా.. అని వారితో మాట్లాడారు. ఆసరా పింఛన్ వస్తుందా అని అడిగారు. గతంలో, ఇప్పటికీ ఉన్న తేడాను వారు ఎమ్మెల్యేకు వివరించారు. పలువురి ఇండ్లలోకి వెళ్లిన ఎమ్మెల్యేకు గ్రా మస్తులు తమ జీవన విధానాన్ని, పొందుతున్న లబ్ధిని వివరించారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్రావు, ఎంపీపీ మధు, రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నరేందర్రెడ్డి, సర్పంచ్ అనసూయమ్మ, టీఆర్ఎస్ నాయకులు బంగార య్య, మురళి, సుధాకర్, జయరాం తదితరులు పాల్గొన్నారు.