హైదరాబాద్, నమస్తే తెలంగాణ (ఆట ప్రతినిధి): తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ సంజన సిరిమల్ల ఐటా అండర్-18 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇండోర్ వేదికగా జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో సంజన 6-1, 6-3తో సుహిత మారురి (కర్ణాటక)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్లో సంజన 7-5, 6-1తో లక్షీప్రభ (తమిళనాడు)ను చిత్తు చేసి ఫైనల్ చేరింది.
ఇవి కూడా చదవండి..