దుబాయ్: 21వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా.. జావెలిన్ త్రోలో 70.29 మీటర్లు విసిరిన దీపాన్షు శర్మ స్వర్ణం గెలవగా 70.03 మీటర్లతో భారత్కే చెందిన రోహన్ యాదవ్ రజతం సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగు పందేన్ని 3 నిమిషాల 50.85 సెకన్లలోనే పూర్తిచేసిన ప్రియాన్షు రజతం నెగ్గాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ రజతంతో మెరిశాడు.