యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించా రు. కొండపైన భక్తులు నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్ర పాలకుడిని కొలుస్తూ అర్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు.
తమలపాకులతో అర్చన చేపట్టారు. వివిధ రకాల పూలమాలలతో అలంక రించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అర టి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు.