యాదాద్రి: యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో పురోహితులు సోమవారం పర మశివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిపారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలసిన బాలాశివాలయంలో ప్రభాత వేళలో మొదటగా గంటన్నర శివుడ్ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు.
ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. విభూతితో ఆలంకరణ చేశారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.