నమస్తే తెలంగాణ నెట్వర్క్: కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఐదోరోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10గంటల తర్వాత వాహనాలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన నాలుగు గంటల సమయంలోనే ప్రజలు బయటకొచ్చి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి గడువు ముగిసేలోపు ఇండ్లకు చేరుకున్నారు. 20 గంటలపాటు ప్రజలు ఇండ్లలోనే ఉంటూ లాక్డౌన్కు సహకరిస్తున్నారు.
ఆత్మకూరు(ఎం), మే 16: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ఐదోరోజు ప్రశాంతంగా జరిగింది. ఉద యం 10గంటల తర్వాత వ్యాపారులు తమ షాపులను మూ సివేశారు. ప్రజలు కూడా బయటకు రాకపోవడంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
ఆలేరుటౌన్, మే 16 : ఆలేరు పట్టణంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. వ్యాపారులు ఉదయం 6 గంటలకు షాపులను తెరిచి 10 గంటలలోపు మూసివేశారు. ప్రజలకు రోడ్లపైకి అనవసరంగా రావద్దని, లాక్డౌన్కు సహకరించాలని ఎస్ఐ రమేశ్ కోరారు. అలాగే కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పారిశుద్ధ్య కార్మికులతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
చౌటుప్పల్, మే16 : చౌటుప్పల్లో లాక్డౌన్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం 10గంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితమవ్వడంతో చౌటుప్పల్ జాతీయ రహదారితోపాటు సర్వీస్ రోడ్లు, కాలనీ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. కాగా ప్రతి ఆదివారం చౌటుప్పల్లో జరిగే వారాంతపు సంత బంద్ అయ్యింది.
ఆలేరురూరల్, మే16 : మండలంలోని పలు గ్రామాల్లో లాక్డౌన్ ఆదివారం సంపూర్ణంగా జరిగింది. ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు ప్రజలు నిత్యావసర సరుకులను షాపు ల్లోకెళ్లి తీసుకెళ్లారు. అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. జనం లేకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
తుర్కపల్లి, మే16 : మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6గంటలకు వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచి 10 గంటల లోపు వ్యాపారులు మూసి వేశా రు. కాగా మండల కేంద్రంలో ఉన్న చికెన్, మాంసం దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ఉదయం 8గంటల లోపే అన్ని షాపుల్లో చికెన్, మటన్ భారీగా కొనుగోలు జరగడంతో ఆయా షాపుల ఎదుట నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో కొందరు చికెన్ దొరకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.
యాదాద్రి, మే16: కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఐదోరోజు ఆదివారం కట్టుదిట్టంగా అమలైంది. యాదగిరిగుట్ట పట్టణంలో అత్యవసర విధులు నిర్వహించే వారిని అనుమతించి, అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేశా రు. ఆ సమయంలో పట్టణ ప్రధాన రోడ్డు నాలుగు గంటల పాటు ప్రజలతో కిటకిటలాడాయి. ఆ తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు బోసిపోయాయి.
రామన్నపేట, మే16: మండలంలో ఉదయం పది గంటల తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఆదివారం మండలకేంద్రంలో ఉదయం 10 గంటల లోపే వ్యాపారులు తమ షాపులను మూసివేసి లాక్డౌన్కు సహకరించారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
భువనగిరి అర్బన్, మే 16: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. పలు గ్రామాల్లో పోలీసులు లాక్డౌన్ ఆంక్షలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టారు. మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద రూరల్ ఎస్ఐ సైదులు వాహనాలను తనిఖీ చేశారు.
మోత్కూరు, మే 16: మోత్కూరు, గుండాల మండలాల్లో లాక్డౌన్ ఐదోరోజు ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మో త్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో, గుండాల మండల కేం ద్రంలో సడలింపు సమయం ఉదయం 6నుంచి 10 గంటల వరకు వ్యాపారులు షాపులను తెరిచారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇండ్లకే పరిమితం కావడంతో పట్టణ, గ్రామాల్లో ని ప్రధాన రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ ఉదయ్కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
బొమ్మలరామారం, మే16: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 గంటల్లోపు వ్యాపారులు అన్ని దుకాణాలు మూసివేశారు. ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీసీ సత్తయ్యగౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టును పరిశీలించి, లాక్డౌన్ అమలు తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు సాగిస్తే వాహనదారులపై కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ సీఐ ముని, సివిల్ ఎస్ఐ నవీన్బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.