ఇంటింటా ఇన్నోవేటర్లో
జిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి ఒక్కొక్కటి ఎంపిక
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్లో ప్రదర్శన
ప్రశంసా అందించనున్న కలెక్టర్లు
రాష్ట్రంలో ద్వితీయ స్ధానంలో యాదాద్రి జిల్లా
ఇంటింటా ఇన్నోవేటర్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి జిల్లాలో తొమ్మిది ఎంపిక
రేపు ఆన్లైన్లో ప్రదర్శన
ప్రశంసించనున్న కలెక్టర్లు
రామగిరి/భువనగిరి కలెక్టరేట్ ఆగస్టు13: ఒక ఆలోచన వినూత్న ఆవిష్కరణకు బీజం వేస్తుందని గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్ నూతన ఆవిష్కరణల్లో మనోళ్లే ముందు నిలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి 9 ప్రదర్శనలు ఫైనల్కు ఎంపిక కాగా ఏడు ప్రదర్శనలతో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ద్వితీయస స్థానం చోటుచేసుకోవడం గమనార్హం. విద్యార్థులు, యువత, రైతులు ఇతరుల నుంచి నూతన ఆవిష్కరణ ప్రాజెక్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా వచ్చిన వాటిలో మూడు దశల్లో ఫిల్టర్ చేసి ఫైనల్ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. అయితే ఎంపికైన ప్రాజెక్టును ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్లైన్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రదర్శన అనంతరం వారిని ఆయా జిల్లాల కలెక్టర్లు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
ఎంపికైన ప్రాజెక్టులు ఇవే…
నల్లగొండ జిల్లా నుంచి మొత్తం 12ప్రాజెక్టులు రాగా వీటిలో ఒకటి ఫైనల్స్కు ఎంపికైంది. జిల్లాలోని మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన డి. నిఖిల్ తయారు చేసిన ఎలక్ట్రికల్ మాస్క్ ప్రాజెక్టు ప్రదర్శన జరగనున్నది.
సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం ఒక ప్రాజెక్టు ఎంపికైంది. అశోక్ బోరె అనే విద్యార్థి తయారు చేసిన శరీరాన్ని వంచకుండా అనే ప్రాజక్టును తయారు చేశాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బాలయ్య అనే వ్యక్తి చేనేత చీరెలో 121 రంగులతోపాటు 121 డిజైన్లను రూపొందించి నేశాడు. రికార్డు అసిస్టెంట్ నర్సయ్య తక్కువ ఖర్చుతో డ్రమ్సీడర్ను తయారు చేశాడు. శివ, ప్రభాకర్, రామకృష్ణ, రమేశ్, దుర్గ, శిరీష కలిసి శ్వాస తీసుకునే ముందు బాహ్య గాలిని శుద్ధి చేసే ఎలక్ట్రికల్ మాస్కును తయారు చేశారు. శివప్రసాద్ అనే యువకుడు స్మార్ట్ డస్ట్ బిన్ తయారు చేశాడు. రెహాన్ అనే విద్యార్థి సింగిల్ ఫిజికల్ స్టెయిన్ అనే అంశంపై ప్రాజెక్టు తయారు చేశాడు. శ్రావణి అనే విద్యార్థిని రాత్రిపూట సులభంగా నడిపించే పరికరాన్ని తయారు చేసింది. రాకేశ్ అనే విద్యార్థి వినియోగదారులు సులభంగా ఉపయోగించే స్మార్ట్ కౌంటర్ అనే ప్రాజెక్టును తయారు చేశాడు. ఈ ప్రదర్శనలు ఫైనల్కు ఎంపిక కావడంతో రేపు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆన్లైన్లో ప్రదర్శనలు జరగనున్నాయి.
నూతన ఆవిష్కరణలకు గుర్తింపు
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 13: సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావటానికి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య ఎంపికయ్యాడు. చేనేత చీరెలో 121 రంగులతోపాటు 121 డిజైన్లను రూపొందించి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినందుకుగాను ప్రభుత్వం ఆయన కళా ప్రతిభను గుర్తించింది. అంతే కాకుండా మండలంలోని దేశ్ముఖి గ్రామానికి చెందిన శివ బృందం ఎలక్ట్రికల్ మాస్క్ తయారు చేసిందుకుగాను (ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి) అతన్ని ఎంపిక చేసింది. మాస్క్ను తరచూ మార్చకుండానే ఈ ఎలక్ట్రికల్ మాస్క్ మనం పీల్చే గాలిని స్వచ్ఛపరుస్తూలోనికి పంపుతున్నది.
వలిగొండ, ఆగస్టు 13: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని లో భాగంగా మండలంలోని పహిల్వాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రేపాక శివప్రసాద్, దుబ్బ రాకేశ్ పాల్గొన్నారు. ఎంపిక చేసుకున్న ఆవిష్కరణలకు వీరు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్నట్లు జిల్లా విద్యాధికారులు ప్రకటించారు.
వలిగొండ మండలంలో ఇద్దరు ఎంపిక
వలిగొండ, ఆగస్టు 13: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని లో భాగంగా మండలంలోని పహిల్వాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రేపాక శివప్రసాద్, దుబ్బ రాకేశ్ పాల్గొన్నారు. ఎంపిక చేసుకున్న ఆవిష్కరణలకు వీరు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కించుకున్నట్లు జిల్లా విద్యాధికారులు ప్రకటించారు.
స్మార్ట్ కౌంటర్
సమావేశానికి ఎంతమంది హాజరయ్యారనే లెక్కను ఖచ్చితంగా స్మార్ట్కౌంటర్ సహాయంతో తెలుసుకోవచ్చు, ప్రధాన ముఖ ద్వారా స్మార్ట్ కౌంటర్ను ఏర్పాటు చేస్తే సరిపోతున్నది. వచ్చిన వారి సంఖ్యను టైంతో సహా సమాచారాన్ని అందిస్తున్నది. వచ్చిన వారిలో ఎంతమంది బయటకు వెళ్లారు అనే ఖచ్చితమైన సమాచారం అందించడంలో సహాయపడుతున్నది. నేను ఎంచుకున్న ఆవిష్కరణకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంది. నాకు సహకారం అందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-దుబ్బ రాకేశ్, టెన్త్ విద్యార్థి, జడ్పీహెచ్ఎస్, పహిల్వాన్పూర్, మండలం వలిగొండ
స్మార్ట్ డస్ట్బిన్
ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటేనే కుటుంబం అంత ఆరోగ్యంగా ఉంటుందనే ఆలోచనతో స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేశా. ఇల్లు, పరిసరాలను ప్రతి సారి శుభ్రం చేయలేము కదా… చెత్తను బయట వేయాలంటే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ నేను తయారు చేసిన స్మార్ట్ డస్ట్బిన్ రిమోట్ సహాయంతో పని చేస్తున్నది. కూర్చున ప్రదేశం నుంచి రిమోట్లో ఉన్న 1,2,3, నంబర్లను ఉపయోగిస్తూ వెనుకకు ముందుకు కదుపవచ్చు. లోపల ఉన్న సెన్సార్ల సహాయంతో డస్ట్బిన్ మూత ఓపెన్ అవుతుంది. అప్పుడు మనము చెత్తను డస్ట్బిన్లో వేసి రిమోట్ సహాయంతో అనుకున్నచోటికి తరలించవచ్చు. వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, కార్యాలయల్లో పనిచేసే ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్డస్ట్బిన్ తయారు చేయడానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-రేపాక శివప్రసాద్, టెన్త్ విద్యార్థి, జడ్పీహెచ్ఎస్ పహిల్వాన్పూర్, మండలం వలిగొండ
మల్టీపర్పస్ స్టిక్ ఫర్ ఫార్మర్స్
బీబీనగర్, ఆగస్టు 13 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు సంవత్సరాల క్రితం టెన్త్ చదివిన కె.శ్రావణి పొలంలో నడుస్తూ రైతులు పాముకాటుకు గురికాకుండా ఉండటానికి చేతి కర్రను (మల్టీపర్పస్ స్టిక్ ఫర్ ఫార్మర్స్) తయారు చేసి రాష్ట్ర స్థాయిలో ఎంపికైంది. రైతులు, వృద్ధులు సాధారణంగా వాడే చేతి కర్ర ద్వారా చాలా సమస్యలు పరిష్కరించేలా ఈ పరికరాన్ని తయారు చేసింది. ఈ పరికరం తయారు చేయటానికి సైన్స్ టీచర్ బి. శ్రీనివాసులు సూచనలు, సలహాలు తీసుకున్నది. పొలంలో నడుస్తూ రైతులు ఈ పరికరాన్ని వాడటం ద్వారా దీని నుంచి వచ్చే తరంగాలు ఆదారిలోని పాములకు చేరి అవి అక్కడి నుంచి పారిపోయి రైతులు రక్షించబడుతారు. దీని బజర్ నుంచి వచ్చే శబ్దాల ద్వారా పొలంలో ఉన్న జంతువులు పారిపోతాయి. ఈ కర్ర అడుగు భాగంలో ఉండే లైట్ రైతులు, వృద్ధులకు రక్షణగా పనిచేస్తున్నది. ఈ పరికరం ఇప్పటికే జాతీయ స్ధాయి ఇన్స్పైర్లో ఉత్తమ ఆవిష్కరణకు ఎంపికకాగా… ఎన్ఐఎఫ్ వారి పేటెం ట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నది.
ఈజీ మ్యాన్హోల్లిఫ్టర్
బీబీనగర్, ఆగస్టు 13 : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన్హోల్ను సులువుగా తీయటానికి ఉపయోగించే పరికరాన్ని (ఈజీ మ్యాన్హోల్లిఫ్టర్) కనుగొని రాష్ట్ర స్థాయిలో రెండో స్థానానికి ఎంపికయ్యాడు. మూతను తీయటానికి పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు తెలి పాడు. ఈ పరికరం తయారుచేయటానికి సైన్స్ టీచర్ బి. శ్రీనివాస్ సూచనలు, సలహాలు తీసుకున్నాడు.