భువనగిరి అర్బన్, ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ అనితారామచంద్రన్, డీఈవో కార్యాలయంలో డీఈవో చైతన్యజైనీ పూలే చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అదేవిధంగా పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా పూలే విగ్రహానికి అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, కీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నిర్మల, బీసీ సంఘం ఆధ్వర్యంలో నర్సింహ్మస్వామి, బహుజన సమాజ్పార్టీ ఆధ్వర్యంలో గోపి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణ, వెంకటేశ్, అశోక్, రవికుమార్, ప్రమోద్కుమార్, జహంగీర్, అశోక్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్లో..
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్11: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి తహసీల్దార్ గిరిధర్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు.
చౌటుప్పల్లో..
చౌటుప్పల్, ఏప్రిల్11 : మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, కౌన్సిలర్లు బాబాషరీఫ్, లింగస్వామి, నాగరాజు, పరమేశ్, స్వామి, బాలకృష్ణగౌడ్, బాలరాజుగౌడ్, భాస్కర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
స్థానిక రాజీవ్స్మారక భవనంలో పూలే జయంతిని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భద్రయ్య, శ్రీనాథ్, సైదులుగౌడ్, రవీందర్, రామచంద్రం పాల్గొన్నారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, ఏప్రిల్ 11 : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆదివారం జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ అంజయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.
బీబీనగర్లో..
బీబీనగర్, ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని బీసీ సంఘం మండల అధ్యక్షుడు జంగయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అశోక్, సత్యనారాయణ, మనోహర్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని దళిత బహుజన సంఘా ల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షుడు యాదగిరి, శాఖ గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణ, అంజయ్య, పవన్కుమార్, సుధాకర్, రమేశ్, రామచందర్, భిక్షపతి, రాజు, మహేశ్, శివ, ఆంజనేయులు పాల్గొన్నారు.
బీసీ విభాగం ఆధ్వర్యంలో..
మోత్కూరు, ఏప్రిల్ 11: టీఆర్ఎస్ బీసీ సెల్ విభాగం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్వెంకటయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న,కుమార్, స్వామి, వెంకన్న, పరమేశ్, రాజు, అనిల్, రాందాస్ పాల్గొన్నారు.
దాచారం గ్రామంలో..
మండలంలోని దాచారంలో పూలే విగ్రహానికి గ్రామ టీఆర్ఎస్ శాఖ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, మల్లయ్య, మల్లయ్య, మురళి, లిం గయ్య, స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట, ఏప్రిల్11: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రా మాల్లో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని నీర్నెంముల గ్రామంలో వైస్ ఎంపీపీ ఉపేందర్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యాదగిరి, రమేశ్, స్వామి, లింగస్వామి, యాద య్య, రవీందర్, శ్రీకాంత్, నవీన్ మత్స్యగిరి పాల్గొన్నారు.