భువనగిరి అర్బన్, జూలై11: పల్లెబాట కార్యక్రమంతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని వీరవెల్లి, బండసోమారం గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఉద యం 7 గంటల నుంచి పర్యటించారు. వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా వార్డుల్లో కలియతిరిగి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే మీ ముందుకు వచ్చానని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పల్లెప్రగతిలో గుర్తించి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అన్ని వార్డులను సందర్శించి అవసరమైన చోట సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేసేందుకు కొలతలు వేయిం చి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, చందుపట్ల మాజీ సింగిల్విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలం ఓంప్రకాశ్గౌ డ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మోహన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, పవన్సతీశ్, కృష్ణ, సత్యనారాయణ, మల్లికార్జున్, వీరేశ్యాదవ్, మహేశ్, మధు, ప్రవీణ్కుమార్, ఎంపీటీసీ లలితామల్ల య్య, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
విద్యార్థి వైద్యానికి ఖర్చు నేనే భరిస్తా..
వీరవెల్లి గ్రామంలోని ఎస్సీకాలనీలో ఎమ్మెల్యే శేఖర్రెడ్డి వార్డు సమస్యలను పరిశీలిస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన చిట్టిగల్ల సుధాకర్ కుమారుడు ప్రసాద్ ముం దుగా వెళ్తున్నాడు. అబ్బాయి దివ్యాంగుడు. ఈ క్రమంలో అబ్బాయిని ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి నీ పేరు ఏమిటి అని అడిగితే ప్రసాద్ అని, ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నానని చెప్పాడు. నీ కాలుకు ఏమైందని అడుగగా పోలియోతో చిన్నతనంలో పోయిందని చెప్పాడు. చలించిపోయిన ఎమ్మెల్యే శేఖర్రెడ్డి పక్కనే ఉన్న రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్యతో మాట్లాడగా చిన్నతనంలో పోలియోతో పోయిందని, పలు దవాఖానలకు తీసుకెళ్లారని, ఆర్థ్ధికంగా ఇబ్బందులు ఉండటంతో వైద్యం చేయించుకోలేక పోయారని చెప్పాడు. దీంతో ప్రసాద్ కాలు వైద్యానికి ఖర్చు నేనే భరిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతోపాటు ఆ బాలుడిని దవాఖానకు తీసుకెళ్లాలని వారి తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు.