యాదాద్రి, జూన్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు ఆస్థానపరంగా నిర్వహించారు. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధానాలయంలోని పుష్కరిణి వద్ద హనుమంతుడికి ఆగమశాస్త్రరీతిలో సిందూరంతో అభిషేకించి, తమలపాకులతో అర్చించారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి గుండం వద్దగల ఆంజనేయస్వామి వారి ఆలయంలో పారాయణందార్లు అభిషేకం, లక్ష తమలపాకులతో అర్చన, మహానివేదన వంటి పూజాదికాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా స్వామివారి కైంకర్యాలు ఆంతరంగికంగా జరిగాయి. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూ ర్తి, ప్రధానార్చకుడు మోహనాచార్యులు, అర్చకు లు, ఉప అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
శాస్ర్తోక్తంగా నిత్య కైంకర్యాలు
స్వామివారి బాలాలయంలో శుక్రవారం నిత్య కైంకర్యాలు ఆంతరంగికంగా జరిగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్చకులు కవచమూర్తులను సువర్ణాపుష్పాలతో అర్చించి, వేదమంత్రాలతో అభిషేకించారు. తులసీదళాలు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చన చేశారు. సాయంత్రం వేళ బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాల మధ్య ఊంజల్ సేవను నిర్వహి ంచారు. అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. స్వామివారి బాలాలయంలో లక్ష్మీనృసింహులను దివ్యమహోహరంగా అలంకరిం చి నిత్యతిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యం త వైభవంగా జరిపారు. మొదటగా సుదర్శన నా రసింహహోమం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారికి రోజువారీ నిత్యారాధనలు వైభవం గా జరిగాయి. వేకువజామూన సుప్రభాతంతో ఆరంభించిన నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవ వేడుకలతో ముగిశాయి.