భువనగిరి అర్బన్, ఏప్రిల్ 1: కరోనా సెంకడ్ వేవ్ వ స్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించా లని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటికి రావొ ద్దని పట్టణ సీఐ సుధాకర్ అన్నారు. రాచకొండ కమిష నరేట్ ఆధ్వర్యంలో కళాజాత బృందం సభ్యులతో పట్ట ణంలోని ప్రధాన కూడళ్లలో గురువారం మాస్కుపై ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరి కట్టాలన్నారు. వాహనదారులు, ప్రజలు బహిరంగ ప్ర దేశాల్లో, కూడళ్లలో తిరిగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, లేనిచో వారికి రూ.1000 జరిమానా త ప్పదన్నారు. కళాజాత బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై లు శేఖర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మాస్కు లేకుంటే జరిమానా తప్పదు..
మోటకొండూర్: బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుం డా తిరిగితే జరిమానా తప్పదని ఎస్సై నాగరాజు అ న్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేష న్ ఆవరణలో కరోనా వైరస్పై పలువురికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు లు ధరించాలన్నారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ప్రభాకర్, రమేశ్, జాన్రెడ్డి, గ్రామస్థులు మల్లే శ్యాద వ్, శ్రీకాంత్, మంజూర్ఖాన్, వెంకటేశ్ ఉన్నారు.
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి
బీబీనగర్: కరోనా మహమ్మారి రెండో దశ విజృంభి స్తున్న తరుణంలోప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు. గురువారం బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రజలంతా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని లేకుం టే జరిమానా తప్నదని అవగాహన కల్పించారు. వా హనదారులు, ప్రజలు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించి కొవిడ్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గణేశ్ రెడ్డి, పోలీ సు సిబ్బంది, సర్పంచ్ లత, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఎయిమ్స్ బీబీనగర్లో అన్నివేళలా టీకా
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బీబీనగర్ ఎయిమ్స్లో మార్చి 15న కొవిడ్ 19 వాక్సినేష న్ సెంటర్ను ప్రారంభించి అన్ని సౌకర్యాలు కల్పించామ ని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. 45 సం వత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఉదయం 9గం నుంచి సా యంత్రం 4గం. వరకు, ప్రభుత్వ సెలవులు, ఆదివారా ల్లో కూడా వాక్సినేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుం దని తెలిపారు. దవాఖానకు వచ్చేవారు మాస్కులు ధరిం చాలని,కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు.
ఇవీ కూడా చదవండీ..
శరద్ పవార్ కు శస్ర్త చికిత్స విజయవంతం
కేరళలో 300 కిలోల హెరాయిన్ పట్టివేత..