యాదాద్రి: పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి ఆదివారం భక్త జనులతో పులకించింది. సెలవుదినం కావడంతో పాటు దసరా పండుగ ముగిసిన నేపథ్యంలో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు సందడిగా మారింది.
ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. యాదాద్రీశుడి నిత్య కైంకర్యాలు అర్చకులు శాస్ర్తోక్తంగా చేపట్టారు. మండపాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.