నీలగిరి, ఏప్రిల్ 22 : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో నాలుగో రోజు సోమవారం పదిమంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు కాగా మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు అందజేశారు. ఆధార్ పార్టీ నుంచి ఏడ నాగపుల్లారావు, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, ఎం సీపీఐ(యూ) నుంచి వసుకుల మట్టయ్య, ధర్మ సమాజ్పార్టీ నుంచి తలారి రాంబాబు, స్వతంత్ర అభ్యర్థులుగా మర్రి నెహమియా, పోనుగోతు లాల్సింగ్నాయక్, చీదల్ల వెంకట్సాంబశివరావు, లింగం కృష్ణ, వంగపల్లి కిరణ్ నామినేషన్ దాఖలు చేశారు.
భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు కొనసాగింది. సోమవారం పదకొండు మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగేకు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ 3 సెట్లు, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి నల్ల కరుణాకర్రెడ్డి, పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ అభ్యర్థి వింధ్యాల సదానందరెడ్డి 2 సెట్లు, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కందాడి మణిపాల్రెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కొంగర లింగస్వామి 2 సెట్లు, స్వతంత్ర అభ్యర్థులు వరికుప్పల కృష్ణ, భాషబోయిన లక్ష్మయ్య, కొంగరి మల్లయ్య, గాదెపాక అనిల్కుమార్, ఈదుల వీరపాపయ్య 2 సెట్లు, నకల సురేందర్, నామినేషన్ దాఖలు చేశారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి క్యామ మల్లేశ్ సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.