భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట ర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీఎన్ తిమ్మాపురం, తదితర గ్రామా ల రైతులతో, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల శాఖల అధికా రులతో కలెక్టర్ మాట్లాడారు.
పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగకుండా చూడాలని రైతులు ఈ సందర్భంగా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
అధికారులు కూడా నిజాయితీగా పని చేసి రైతులకు నష్టం కలుగకుండా నివేదికలు, ఇండ్లు, భూముల వివరాలు ఇవ్వా లని బీఎన్ తిమ్మాపురం రైతులు కలెక్టర్ను, ఇతర అధికారులను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వ డానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయ మని, అభివృద్ధికి సహకరించడం గొప్ప విషయమన్నారు.
రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి అవకా శాన్ని కల్పించడం జరుగుతుం దన్నారు. గ్రామంలోని 594 ఇండ్లకు సంబంధించి 641కుటుంబాల వారు ఉన్నందున ప్రభుత్వ ఉత్తర్వులు 125 ప్రకా రం పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం 18సంవత్సరాలు నిండిన వారందరినీ పరిగణలోకి తీసుకోగా 1085మందికిగాను ఇంటి స్థలంతో పాటు రూ,7,61,000 పరిహారం అందించనున్నట్లు తెలిపారు
ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన పునరావాస ప్యాకేజీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇందుకుగానూ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్థులు కోరగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 200 గజాల చొప్పున లే-వుట్ అభివృద్ధి చేసి అప్పగిస్తామని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, తహసీల్దార్ శ్యాం సుందర్రెడ్డి, ఇతర అధికారులు, గ్రామస్థులు, వివిధ సంఘాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.