గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రతిరోజూ రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురౌతున్నారని, తలసేమియా, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, ఏదైనా పునరుత్పత్తి చేసుకోవచ్చు గానీ రక్తాన్ని మాత్రం ఎవరో ఒకరు దానం చేయడం వల్లే పొందవచ్చన్నారు. రక్త దానంపై అపోహలు వీడాలన్నారు. ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అతి వేగంతో వాహనాలను నడపొద్దని, పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దన్నారు. పోలీసులు ధర్మం, చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తారని, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు
50 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు రెడ్క్రాస్ సంస్ధ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, సర్పంచ్ దార సైదులు, ఏసీపీ వినోద్కుమార్, సీఐ వినయ్కుమార్, వైద్యాధికారి డా.శ్రీనివాస్, రెడ్క్రాస్ జిల్లా ప్రతినిధి లక్ష్మీనర్సింహారెడ్డి, ఎస్సైలు తిరుపతి, సందీప్కుమార్, ఏఎస్ఐ భిక్షం, పోలీస్ సిబ్బంది రవికుమార్, యాసిన్, స్వామి, హుస్సేన్, భాస్కర్, రాజు, సోమశేఖర్ పాల్గొన్నారు.