మోత్కూరు: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరిం తగా బలోపేతం చేయడానికి కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మంగళవారం హైదరా బాద్లోని ఆయన నివాసంలో మోత్కూరు మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డు పల్లి కల్యాణ్ చక్రవర్తిలు తమ నూతన కార్యవర్గ ప్రతినిధులతో ఎమ్మెల్యే కిశోర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
శాలువా కప్పి పూల మొక్కలను అందజేసి ఆశీర్వాదం తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి, రైతు సహకార సంఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు విష్ణుమూర్తిగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల క్రాంతికుమార్రెడ్డి, మండల, మున్సిపాలిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.