వలిగొండ: అతి త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ మండల టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డేగల పాండరి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయ న్నారు. కార్యక్రమంలో మత్స్యగిరి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, ఏఎంసీ చైర్ నర్సన్ కునపూరి కవిత, ఎంపీటీసీలు తుమ్మల వెంకట్రెడ్డి, పల్సం రమేష్, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, నారిబాల కృష్ణ, శంకర్గౌడ్, ఎమ్మె లింగస్వామి, అయిటిపాముల ప్రభాకర్, మన్నెం ప్రకాశ్రెడ్డి, నారి మల్లేశ్, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.