హైదరాబాద్ : నాందేడ్- ఆదిలాబాద్ల మధ్య నడిచే ఇంటర్సిటీ రైలు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. తలమడుగు మండలం డోర్లిగేడ్ వద్ద చేరుకోగానే ఒక్కసారిగా రైలు ఇంజిన్లో పొగలు రావడంతో అప్రమత్తమైన లోకోపైలెట్ వెంటనే రైలును నిలపివేశాడు. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాపించినట్లు సిబ్బంది భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సాంకేతిక సిబ్బందిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నట్టుండి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.