కరీంనగర్: అసలే మద్యం మత్తు. అమ్మాయి కనిపించింది. ఇక మనసు వింటుందా.. వావీ వరసలు మరిచాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె చేతికి దొరికన రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. పట్టణంలోని విద్యానగర్కు చేందిన ఓ వ్యక్తి పూటుగా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో సోదరి కనిపింది. అయితే మద్యం మత్తులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె రోకలి బండతో అతనికి కొట్టి చంపిది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశానని ఆమె వెల్లడించింది. కేసు నమోదుచేసిన పోలీసులు విచారిస్తున్నారు.