న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్ అండ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదలవాల్సి ఉన్నది.
మొత్తం పోస్టులు: 38
ఇందులో ప్రిన్సిపల్ మేనేజర్ 1, జాయింట్ డైరెక్టర్ 12, సీనియర్ మేనేజర్ 2, డిప్యూటీ డైరెక్టర్ 17, మేనేజర్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాల కోసం అభ్యర్థులు డిటెయిల్డ్ నోటిఫికేషన్ చూడవచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇంకా విడుదలకాలేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
వెబ్సైట్: fssai.gov.in