నులిపురుగుల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో అల్బెండజోల్ మాత్రల పంపిణీని
ప్రారంభించిన ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్
భువనగిరి అర్బన్, జూలై 15: నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి అన్నారు. జాతీయ ఫైలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువా రం పట్టణంలోని 23వ వార్డులో బోదకాల నివారణకు ఉచితంగా డీఈసీ, అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడా రు. ఈ మాత్రలు ముందుగా అధికారులు, ప్రజాప్రతినిధులు వేసుకుని ప్రజలు వేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మాత్రలు వేసుకోవడంతో ఎలాంటి ఆందోళన, ఇబ్బంది ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయు లు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, ఉప వైద్యాధికారి డాక్టర్ శిల్పిని, కమిషనర్ పూర్ణచందర్, వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుకాప్రదీప్, ప్రోగ్రా మ్ ఆర్గనైజర్ లీలావతి, డాక్టర్లు రామయ్య, వివేకానంద, నాయకులు ప్రమోద్కుమార్, జహంగీర్, లక్ష్మీకృష్ణయాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని బస్వాపురం గ్రామంలో నులిపురుగుల నివారణపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలో ని హన్మపురం, వడపర్తి, రామచంద్రపురంలో జాతీయ ఫైలేరియ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామాల్లో నులిపురుగుల నివారణపై అవగాహన ర్యాలీలు నిర్వహించి డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు ఎడ్ల రాజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.