యాదాద్రి, జూలై23: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తుల కోలాహలం మధ్యనిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలా లయ ముఖమండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడు తలుగా రూ.516 టికెట్ తీసుకున్న భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ముత్తయిదువలు మం గళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరు వీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయ ముఖ మండపంలోని ఊయలలో శయ నింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్తర పూజ ల్లో భక్తులు పాల్గొన్నారు.
నిజాభిషేకంతో ఆరాధనలు..
యాదాద్రిలో ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొద లైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేకించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గం టలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా స్వామివారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యా ణోత్సంలో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రూ. 3,27,236 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.3,27,236 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలి పారు. ప్రధాన బుక్కింగ్తో రూ.32,244, రూ.100 దర్శనంతో రూ. 11,600, నిత్యకైం కర్యాలతో రూ. 800, క్యారీబ్యాగులతో రూ.1,100, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ.5,500, కల్యాణకట్టతో రూ. 4,800, ప్రసాద విక్రయంతో రూ. 1,49,525, వాహన పూజలతో రూ. 6,200, టోల్గేట్తో రూ. 590, అన్నదాన విరాళంతో 2,282, సువర్ణ పుష్పార్చనతో రూ. 54,600, యాదరుషి నిలయంతో రూ. 18,500, పాత గుట్టతో రూ. 6,495, టెంకాయల విక్రయాలతో రూ. 21,000 తో కలుపుకొని రూ. 3,27,236 ఆదా యం సమకూరినట్లు ఆమె తెలిపారు