వలిగొండ, జూలై 27: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని వలిగొండ వ్య వసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు మంగళవా రం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్పర్సన్ కు నపూరి కవిత ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాల తో ఘనంగా సన్మానించారు. పాలక మండలి సభ్యుల పదవీ కాలం మరో సంవత్సరం పొడగించినందుకు కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు మండలంలో ఎమ్మెల్యే పైళ్లపర్యటన
బీబీనగర్: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి నేడు(బుధవారం) బీబీనగ ర్ మండలంలోని రాయరావుపేట్, కొండమడుగు, గూడూరు. బ్రాహ్మణపల్లి, గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు బీబీనగర్ మండల కేంద్రంలో ని ఫేమస్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు టీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
వలిగొండ: మండల పరిధి జంగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ శివ రాత్రి ఎల్లమ్మ భర్త రాములు ఇటీవల అ నారోగ్యంతో మృతి చెందాడు. మంగళ వారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు డేగల పాండరి, పీఏసీఎస్ చైర్మన్ సు ర్కంటి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ పల్సం ర మేశ్, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.