హనుమకొండ, నవంబర్ 8 : ఇంతకాలం కాంగ్రెస్, బీజేపీలు తమ స్వార్థ రాజకీయాలకు యువతను వాడుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. బుధవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన యువత బీఆర్ఎస్లో చేరారు. బీజేవైయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్లూరి పవన్కుమార్ 250 మంది తన అనుచరులు, కాంగ్రెస్ నాయకుడు కొడకండ్ల సన్నీ తన 100 మంది అనుచరులతో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ భరోసాతో యువతలో ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆరే మళ్లీ సీఎం కావాలన్నారు. గులాబీ సైనికులు ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎవరు ఎప్పుడు పార్టీ మారతారోనని ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్ , వలస సంతోష్, మేఘనాథ్ రాహుల్, గోడిశాల విష్ణు, ఠాకూర్ రోహిత్ సింగ్ పాల్గొన్నారు.