హనుమకొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. రఘురాం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.