శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మంది యువకులకు ఎమ్మెల్యే గండ్ర సోమవారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు యువకులు తెలిపారు.
ఇందులో యువజన నాయకులు శ్యామ్, రాజు, వెంకటేశ్, మున్నా, సురేందర్, సమ్మయ్య, అనిల్, సహోదర్, ప్రవీణ్, పవన్, ప్రదీప్, మనోజ్, సాగర్, అజయ్, రమేశ్, సురేశ్, వంశీ, మహేశ్, నాగరాజు, టింకుల్, కిరణ్,మల్లయ్య, తరుణ్ టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సర్పంచ్ రాజీ రెడ్డి, నాయకులు జైపాల్ రెడ్డి, సమ్మిరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి పాల్గొన్నారు.