అది అసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొని నిత్యం వేల సంఖ్యలో రైతులు వస్తుంటారు. అధికారులు, సిబ్బంది, కార్మికులు వందల సంఖ్యలో ఉంటారు. మరోపక్క వేసవి మొదలైంది.
అయితే, తాగునీటిని అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గురువారం మిర్చి యార్డులోని ఏ షెడ్లో చూసినా ఖాళీ డ్రమ్ములు, రంజన్లు దర్శనమిచ్చాయి. రైతులు, హమాలీలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయారు. పొద్దున్నే రంజన్లలో నింపిన నీళ్లు గంట వ్యవధిలోనే ఖాళీ అయ్యాయి. మళ్లీ నీటిని తీసుకురావాల్సిన వారు పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు, కార్మికులు వాపోయారు.
– వరంగల్ ఫొటోగ్రాఫర్