న్యూశాయంపేట : బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ( Aruri Ramesh ) పిలుపు నిచ్చారు. హనుమకొండ హంటర్ రోడ్ లోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని 1, 2 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో పాలకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు మొగ్గ వద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని గడప గడపకు చేర్చాలని సూచించారు. పార్టీ కష్ట కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తు పెట్టు కుంటుందన్నారు. భవిష్యత్తులో వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.