ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక.. ఇటు తల్లిదండ్రులకు భారం కాలేక ఓ తల్లి తన పసిబిడ్డతో కలిసి బావిలో దూకి తనువుచాలించింది. అమ్మానాన్నల చేతుల్లో అల్లారుముద్దుగా పెరగాల్సిన వయస్సులో నీటిలో నిర్జీవంగా తేలిన పసికూనను చూసి ప్రతి హృదయం తల్లడిల్లింది. దామెర మండలం ఊరుగొండ-పసరగొండ క్రాస్ రోడ్డు సమీపంలోని బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు శుక్రవారం వెలుగుచూడగా ఈ ఘటన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది.
దామెర, నవంబర్ 11 : ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక.. ఇటు తల్లిదండ్రులకు భారం కాలేక ఓ తల్లి తన పసిబిడ్డతో కలిసి బావిలో దూకి తనువుచాలించింది. అమ్మానాన్నల చేతుల్లో అల్లారుముద్దుగా పెరగాల్సిన వయసులో నీటిలో నిర్జీవంగా తేలిన పసికూనను చూసి ప్రతి హృదయం తల్లడిల్లింది. దామెర మండలం ఊరుగొండ-పసరగొండ క్రాస్ రోడ్డు సమీపంలోని బావిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు శుక్రవారం వెలుగుచూడగా ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది.
అదనపు కట్నం వేధింపులు భరించలేక పసికందును బావిలో పడేసి ఓ తల్లి తానుకూడా అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన గురువారం సాయంత్రమే జరిగినట్లు తెలుస్తుండగా శుక్రవారం ఉదయం వారి మృతదేహాలు బావిలో తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. స్థానికులు, దామెర ఎస్సై హరిప్రియ తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం కటాక్షపురం సమీపంలోని హౌజ్బుజుర్గు గ్రామానికి చెందిన నిమ్మల ఆమని( 29), నిమ్మల మురళి దంపతులు. వీరికి అశ్వితసాయి(పది నెలలు) పాప ఉంది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో ఆమనిని అదనపు కట్నంకోసం మురళి వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం హాస్పిటల్కు వెళ్లి వస్తానని భర్తతో చెప్పి కూతురును వెంటబెట్టుకొని ఆమని హనుమకొండకు వెళ్లింది. తిరిగి సాయంత్రం భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో దామెర మండలం ఊరుగొండ-పసరగొండ క్రాస్ రోడ్డు సమీపానికి కొద్దిదూరంలో ఉన్న వ్యవసాయ బావిలో చిన్నారిని బావిలో వేసి తాను కూడా బావిలో దూకి ఆమని ఆత్మహత్యకు పాల్పడింది.
శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన కూలీలు వ్యవసాయబావిలో చిన్న పాప, తల్లి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయించారు. బావి పక్కనే మృతురాలి హ్యాండ్బ్యాగు దొరకగా, అందులో ఉన్న సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసి ఆమని భర్త మురళి ఘటనా స్థలానికి చేరుకొని కూతురు, భార్య మృతదేహాలపై పడి బోరున విలపించాడు. ఆమని స్వ గ్రా మం శాయంపేట మండలం కాట్రపల్లి కాగా తన కూతురు, మనుమరాలి మృతికి వరకట్న వేధింపులే కారణమని ఆమని తల్లి సరళ ఇచ్చిన ఫిర్యా దు మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ హరిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.