గీసుగొండ, నవంబర్ 15 : కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చంద్రయ్యపల్లి, మనుగొండ, రాంపూరం, గంగదేవిపల్లి, మరియపురం, ఊకల్, కోనాయిమాకుల, గీసుగొండ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల నుంచి కొత్త వ్యక్తులు పరకాలకు వచ్చి పోటీ చేస్తున్నారని వారిని నమ్మి ఆగం కావొద్దని అయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇవ్వక పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ గ్రామాల్లో వలసలు మొదలవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ఇప్పుడిప్పుడే పచ్చబడ్డాయని, కాంగ్రెస్కు ఓటు వేసి బతుకులను నాశనం చేసుకోవద్దని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెబుతున్నాడని, ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించుకోవాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో కాంగ్రెస్ గెలుస్తుందని అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పరకాలలో బీజేపీ పార్టీకి దిక్కులేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను మోసం చేసిందన్నారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. గీసుగొండకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చానని తెలిపారు. ప్రజల కోసం నేను పనిచేస్తానని, తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, వైస్ ఎంపీపీ రడం శ్రావ్యాభరత్, సర్పంచ్లు నమిండ్ల రమ, గాజర్ల గోపి, గోనె మల్లారెడ్డి, అల్లం బాలిరెడ్డి, మొగసాని నాగదేవత, డోలి రాధ-చిన్ని, దౌడు బాబు, ఎంపీటీసీలు కంబాల రజిత, బేతినేని వీరారావు, మండల కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, నాయకులు జూలూరి లెనిన్, శ్రీనివాస్, జక్కు మురళి, బాలకిశోర్రెడ్డి, రాంబాబు, అశోక్, సదానందం, గజ్జి రవి, రమేశ్, రాజయ్య, నర్సింగరావు, మోహన్, ధనుంజయ్, అశోక్, సంపత్, కొంగర చంద్రమౌళి, డోలి రమేశ్, కోటా ఆనందం, సునీల్, రాజు, దళిత బంధు సమితి చైర్మన్ కోటా ప్రమోద్, యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచ్లు పూండ్రు జైపాల్రెడ్డి, అంకతి నాగేశ్వర్రావు, బోడకుంట్ల ప్రకాశ్, అనిల్ పాల్గొన్నారు.