సుబేదారి, డిసెంబర్ 4 : అందరం సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చుని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి ఆదివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్, హోంగార్డ్స్, యాంటీ కమాండ్ కంట్రోల్, బాంబు డిస్పోజల్, సీసీఆర్బీ, ట్రాఫిక్ కౌన్సెలింగ్, కంట్రోల్ రూం, డాగ్స్కాడ్, ఆర్ఐ, కన్జ్యూమర్ స్టోర్స్, స్పెషల్ బ్రాంచ్, వైద్యశాల విభాగాలను డీసీసీ, అదనపు డీసీపీ కార్యాలయాలు, కొత్తగా నిర్మిస్తున్న పోలీసు కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు.
ఆయా విభాగాల అధికారులతో పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే తనను నేరుగా కలువొచ్చు లేదా సంక్షిప్త మెసేజ్ ద్వారా తెలియజేయవచ్చని అన్నారు.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడుతానని అన్నారు. సీపీ వెంట ఏఆర్ అదనపు డీసీపీ సంజీవ్, సురేశ్కుమార్, ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేందర్, స్పెషల్ ఏసీపీ తిరుమల్, ఆర్ఐలు నగేశ్, భాస్కర్ ఉన్నారు.