ఆత్మకూరు, జూలై 21 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేకి, ద్రోహి అని, అతడికి రాజకీయ సమాధి తప్పదని చెప్పారు. శుక్రవారం మండలంలోని పెద్దాపురం, ఆత్మకూరు గ్రా మాల్లో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల రైతు కోఆర్డినేటర్ రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు.నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం చేతగాని కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు రాత్రి పూట నిద్రపోకుండా జాగారాలు ఉండేవారన్నారు. అలాంటిది రేవంత్రెడ్డి కరెంట్ సరఫరాపై వ్యాఖ్యలు చేయడంపై అన్నదాతలు మండి పడుతున్నారన్నారు. రేవంత్రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి, ఇప్పుడు రైతులపై కక్షగట్టి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. రైతులు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు రేవంత్ మరచిపోయాడని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతాంగం, ప్రజలు కన్నెర్ర చేస్తున్నారన్నారు. రైతులతె ఆడుకుంటున్న కాంగ్రెస్ పాలన వద్దు.. ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రేవంత్రెడ్డికి అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రైతులు ఎన్ని గంటలు నీరు పారిస్తే ఎన్ని ఎకరాలకు నీరు పారుతుందో రేవంత్రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కానీ, తెలంగాణ ప్రజల సంతోషాన్ని ఓర్వలేని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టడానికి సిద్ధంగా అన్నదాతలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బీ భిక్షపతి, ఎంపీపీ మార్క సుమలతా రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు, వైస్ ఎంపీపీ ఆర్ సుధాకర్రెడ్డి, గూడెప్పాడ్ మార్కెట్ చైర్మన్ బీ రాధా రవియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్ సంజీవరెడ్డి, సర్పంచ్ కమలా రాజేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బీ కుమారస్వామి, ఉప సర్పంచ్ వీ స్వాతీ భగవాన్రెడ్డి, ఎంపీటీసీలు బయ్య రమా రాజు, బొమ్మగాని భాగ్యా రవి, గ్రామ రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు ఆర్ రవీందర్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పీ రవీందర్, మండల కోఆప్షన్ మెంబర్ ఎండీ అంకూస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఏ రాజస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు మధుకర్, నత్తి సుధాకర్, రైతులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
మహిళా భవనం ప్రారంభం..
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో మహిళలు ఐకమత్యంగా ఉండడాన్ని చూసి ఆయన అభినందించారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి ఐకేపీ ఏపీఎం లలితాదేవి, సీసీ సాంబరెడ్డి, వీవోలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.