నర్సింహులపేట, అక్టోబర్17: సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉం దని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ బండ భిక్షంరెడ్డి, జయపురంలో మాజీ ఎంపీటీసీ సుగుణమ్మ, బొజ్జన్నపేట శివారు భీమ్లాతండాలో బానోత్ సర్వన్ను పరామర్శించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ..ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఇటీవ ల సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 93లక్షల మంది తెల్లరేషన్కార్డుదారులకు రూ.5లక్షల చొప్పున కేసీఆర్ బీమా, రూ.15లక్షలతో కేసీఆర్ ఆరోగ్యరక్ష, రైతుబంధు రూ.12వేల నుంచి దశల వారీగా రూ.16వేలకు పెంచినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి తన గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపినట్లు తెలిపారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, సంక్షేమంలో నంబర్వన్గా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టేకుల యాదగిరెడ్డి, కొమ్మినేని రవీందర్, మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, ధర్మారపు వేణు, రైతుబంధు కన్వీనర్లు యల్లు మధుసూదన్రెడ్డి, ఓలాద్రి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంపెట రాము, వైస్ఎంపీపీ జాటోత్ దేవేందర్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శంకర్గౌడ్, గుగులోత్ రవి, మధురెడ్డి, వెంకన్న, సత్తిరెడ్డి, లింగారెడ్డి, అశోక్రెడ్డి, కిషన్నాయక్, హచ్చు, నర్సింహారెడ్డి, రామన్న, చంద్రశేఖర్, లింగ్యా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.