తొర్రూరు, ఏప్రిల్ 14: అధికార అహంతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు తెగబడడం సిగ్గు చేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రైతు, బీఆర్ఎస్ కార్యకర్త ఎండీ అక్బర్పై కొంత మంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి తొర్రూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతుండగా, దయాకర్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్త అక్బర్ చెరువు కుంట నుంచి మొరం మట్టిని తన వ్యవసాయ భూమిలో పోసుకుంటే, ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు మొరం తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ భౌతిక దాడులు చేసి గాయపరచడం బాధాకరమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎకడ ఎలాంటి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడలేదని వాపోయారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్పీ, డీఎస్పీలు స్పందించి విచారణ చేప ట్టి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రామసహాయం కిశోర్రెడ్డి, అంకూస్, ప్రమోద్, రామలింగం, ఐలయ్య ఉన్నారు.